
హైదరాబాద్: కరోనా లక్షణాలు ఉండటంతో బంజారా హిల్స్ కు చెందిన ఏఎస్ఐ టెస్టులు నిర్వహించుకుంటూనే ఉన్నారు. నాలుగు సార్లు పరీక్షలు చేయించుకున్నా నెగెటివ్ ఫలితం వచ్చింది. కానీ లక్షణాలతో పాటు పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఆస్పత్రిలో చేర్చడానికి 40 గంటల పాటు కుటుంబీకులు శ్రమించారు. చివరకు ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో ప్రాణాలు వదిలారు. తర్వాత పరీక్షిస్తే ఆయనకు పాజిటివ్ వచ్చింది.