41(ఏ) సీఆర్పీసీని సవరించిన కేంద్ర న్యాయశాఖ
పోలీస్ స్టేషన్లలో అవినీతికి అడ్డుకట్ట

పోలీసు స్టేషన్లో జరుగుతున్న అవినీతిని అరికట్టడానికి కేంద్ర న్యాయ శాఖ సిఆర్పిసి 41(ఏ) ను సవరించింది. పోలీస్ స్టేషన్లో ఇస్తున్న బెయిల్ విధానాన్ని రద్దు చేసింది. ఇక నుంచి కోర్టుల. ద్వారా మాత్రమే బెయిల్స్ మంజూరు చేయబడతాయి. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేయబడింది. అంతకుముందు, నిత్యవసర వస్తువల బ్లాక్ మార్కెటింగ్, గృహహింస, కుటుంబ తగాదాలు.. ఇలా నిందితులకు ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్షను విధించబడే కేసులలో పోలీస్ స్టేషన్లో జామీను పై బెయిల్ ఇచ్చే అవకాశం ఉండేది. ఈ బెయిల్ ఇచ్చే నెపంతో పోలీస్స్టేషన్లలో బాధితులను దోచుకుంటున్నారని, నేరస్తులకు ఈ వెసులుబాటు విపత్కర పరిస్థితులకు దారితీస్తున్నాయన్న తీవ్రమైన ఆరోపణలు దేశంలో అనేక ప్రాంతాలలో పలు సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో నే 41(ఏ) సీఆర్పీసీ సవరణ పై కేంద్రం న్యాయశాఖ దృష్టి సారించింది. ప్రతి కేసులో నిందితులు బెయిల్ కోసం కోర్టులను సంప్రదించవలసి ఉంటుందని, కొత్త నిబంధన ప్రకారం ఎస్హెచ్ఓ కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది. ఈమేరకు కేంద్ర న్యాయశాఖ పేర్కొంది. ఈ నిర్ణయంతో బెయిల్ పేరుతో పోలిసుస్టేషన్లలో అవినీతికి ఆస్కారం లేకుండా పోయింది.