ఈ ఏడాది 10శాతం నేరాలు తగ్గడంతో కాస్త ఉత్సాహంగా ఉన్న పోలీసులు నగర పోలీసింగ్లో కొత్త స్కీములు ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు మహిళా భద్రత, చిన్నారులపై అఘాయిత్యాలు అరికట్టడం… పోలీసు సిబ్బంది ఆరోగ్య సంరక్షణలాంటి కార్యక్రమాలపై దృష్టి సారించనున్నారు. దీనికోసం 2021లో చేపట్టనున్న 15 అంశాల ప్రణాళికను పోలీసులు సిద్ధం చేసుకున్నారు.
- మహిళా భద్రతకు పెద్దపీట వేస్తూ… సేఫ్సిటీ ప్రాజెక్టును అమలు చేయడం.
- పాతబస్తీలో కొత్త భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం.
- 25 మంది సీటింగ్ కెపాసిటీతో సిటిజన్ సపోర్ట్ హైల్ప్లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం.
- కేసుల్లో సాక్షులకు రక్షణ కల్పించడంపై ఫోకస్.
- 365 రోజులు 24గంటల పాటు వివిధ విభాగాల్లో సేవలందిస్తున్న సిబ్బంది ప్రోత్సాహకంలో భాగంగా సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ ఏర్పాటు.
- నగరంలో 15 కౌన్సెలింగ్ సెంటర్ల ఏర్పాటు
- 1350 కమ్యూనిటీ రూఫ్టాప్ కెమెరా నెట్వర్క్ సర్విలెన్స్ ఏర్పాటు.
- రోడ్లపై ఽభద్రత, ప్రమాదాలు, క్షతగాత్రుల సంఖ్య తగ్గించడానికి ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో చర్యలు.
- సైబర్ నేరాలు/మోసాలను తగ్గించడానికి అధిక సంఖ్యలో అవగాహన కార్యక్రమాల నిర్వహణ.
- పోలీస్ శాఖలో కంప్యూటర్ ఆధారిత జాబితా నిర్వహణ అమలు (ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టం)
- నగర పోలీస్ శాఖ అధికారిక వెబ్సైట్లు ఇంటరాక్టివ్ చేయడం ద్వారా సునాయాసంగా యాక్సెస్ చేసే అవకాశం.
- నగరంలోని అన్ని రోడ్లపై వేగపరిమితులను ప్రదర్శించే ఏర్పాటు చేయడం.
- కమ్యూనిటీ పోలీసింగ్ను మరింత ఆధునికీకరించడం.
- అంతరాష్ట్ర నేరస్తులను పట్టుకునేందుకు నగరంలోని మూడు కమిషనరేట్ల మధ్య సమన్వయాన్ని మరింత పెంపొందించడం.
- ఏడాదిలో రెండు సార్టు ట్రాఫిక్ సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం.