Sunday, April 28, 2024

గన్‌తో కాల్చి…

కత్తితో పొడిచి.. కిరాతకంగా చంపేశారు

మహారాష్ట్ర మార్చ్ 17 నేరాలు – ఘోరాలు: గన్‌తో కాల్చి…
కత్తితో పొడిచి.. ఓ వ్యక్తిని కిరాతకంగా చంపేశారు. ఈ సంఘటన నిన్న రాత్రి మహారాష్ట్ర – ఇందాపూర్‌లో జరిగింది. అవినాశ్ ధన్వే అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి భోజనం చేసేందుకు ఓ హోటల్ కు వెళ్ళగా… సుమారు 6-7 మంది దుండగులు అతనిపై దాడి చేశారు. కుర్చీలో కూర్చున్న అతడిని వెనుక నుంచి వచ్చిన ఇద్దరు మొదట గన్‌తో కాల్చారు. అతడు కుప్పకూలగా మరో ఐదుగురు వచ్చి కత్తులతో క్రూరంగా నరికి చంపారు. ఈ హత్య ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Related Articles

Latest Articles