Sunday, April 28, 2024

డ‌బ్బువివాదం- యువ‌కుడి హ‌త్య‌

హైద‌రాబాద్‌, మార్చ్ 18 నేరాలు-ఘోరాలు: ఆర్థిక లావాదేవీల నేప‌థ్యంలో త‌లెత్తిన వివాదంలో ఓ యువ‌కుడు దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. పీర్జాదిగూడకు చెందిన షేక్ వాజిద్ సోమ‌వారం త‌న బంధువైన మ‌హ‌మ్మ‌ద్ నిసార్ అహ్మ‌ద్‌ను క‌ల‌వ‌డానికి మీర్‌చౌక్ వ‌చ్చాడు. వారి మ‌ధ్య పాత లావాదేవీల వివాదం సాగుతోంది. వారిద్ద‌రి మధ్య మాటా మాటా పెర‌గ‌డంతో నిసార్ అహ్మ‌ద్ ఇంటికి వ‌చ్చిన వాజిద్‌పై దాడికి పాల్ప‌డ్డాడు. ఈ దాడిలో తీవ్ర గాయాల పాలైన వాజిత్ మ‌ర‌ణించాడు. హత్య సమాచారం అందుకున్న మీర్‌చౌక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వాజిద్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు చేరుకున్న త‌ర్వాత హ‌త్య‌కు గ‌ల కార‌ణాల‌పై ద‌ర్యాప్తు ప్రారంభించారు. నిసార్ అహ్మద్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

Related Articles

Latest Articles