Sunday, April 28, 2024

హత్య కేసులో నలుగురికి యావజ్జీవ శిక్ష

నిజామాబాద్, మార్చ్, 22 నేరాలు – ఘోరాలు:
ఆర్మూర్ పీఎస్‌ పరిధిలోని మామిడిపల్లి మహిళ హత్య కేసులో నిజామాబాద్ కోర్టు సంచల తీర్పునిచ్చింది.
నలుగురిని దోషులుగా తేల్చిన కోర్టు వారందరికీ యావజ్జీన శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
2018లో చేతబడి నేపంతో బోణిగె భారతి అనే మహిళను తోకల చిత్ర, మరో ముగ్గురు కలిసి హత మార్చినట్లు కోర్టు నిర్ధారించింది. భారతి చేతబడి చేయడం వల్లే అనారోగ్యం పాలయ్యానని అనుమానం పెంచుకున్న చిత్ర తన సమీప బంధువులైన ముగ్గురు యువకులతో కలిసి భారతిని హత్య చేసినట్లు రుజువు అయింది.
అప్పట్లో భారతి గొంతు కోసి హత్య చేసిన అనంతరం మెడలో బంగారు గొలుసులు ఎత్తుకెళ్లిన నిందితులు కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు.
నలుగురు నిందితుల కాళ్లు, వేలి ముద్రలు, సీసీ కెమెరాల దృశ్యాలు, ఫోన్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు కోర్టు కు ఆధారాలు సమర్పించారు.నలుగురికి యావజ్జీవ శిక్ష విధిస్తూ నిజామాబాద్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

Related Articles

Latest Articles